అవిశ్వాసాన్ని అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వం, అన్నాడీఎంకే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించడానికే అన్నాడీఎంకే ఎంపీలు సభను అడ్డుకొంటున్నారని చెప్పారు. ప్రతిరోజూ సభలో ఆందోళన చేస్తున్న సభ్యులపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఖర్గే ప్రశ్నించారు. తమకు అవిశ్వాసం ఎంతో కీలకమన్న ఖర్గే..ప్రత్యేక హోదాతో పాటు, కావేరి జల వివాదం గురంచి సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.