అరాచక శక్తులను సహించం : సీఎం కేసీఆర్

Update: 2018-03-13 05:36 GMT

తెలంగాణలో అరాచక శక్తులను సహించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి దురదృష్టకరమనీ, బాధాకరమని శాసనసభలో అన్నారు. నిన్నటి ఘటన కాంగ్రెస్ సభ్యుల అరాచకాలకు పరాకాష్ట అన్న ముఖ్యమంత్రి రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయాల్లో ఇంత అసహనం పనికిరాదన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ కఠిన నిర్ణయమే అయినా తప్పదని వ్యాఖ్యానించారు.
 

Similar News