వైసీపీ, జనసేన పార్టీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా హోదా కోసం పోరాటం కొనసాగిస్తానని అన్నారు. తన పోరాటంలో ఎవరు అడ్డు వచ్చినా వాళ్ల అడ్రస్ గల్లంతవుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ లో మోడీ కాళ్లు మొక్కుతున్న వైసీపీ నేతలు బయటికొచ్చి తనపై కాలు దువ్వుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో బుడగ జంగాల మహా సభకు హాజరైన సీఎం చంద్రబాబు భవిష్యత్ తరాల కోసమే కేంద్రాన్ని నిలదీశానని చెప్పుకొచ్చారు.