ఢిల్లీ హైకోర్టుకు చేరిన సీబీఐ వివాదం ..

Update: 2018-10-23 08:33 GMT

సీబీఐ డైరెక్టర్‌, డిప్యూటి డైరెక్టర్‌ మధ్య రేగిన ముడుపుల వివాదం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ డిప్యూటి డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రాకేష్‌ ఆస్ధానా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరో వైపు ఇదే కేసులో అరెస్టయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్ కూడా కోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన ఆరోపించారు. విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కొద్ది సేపటి క్రితం విచారణ ప్రారంభించింది.  
 

Similar News