తమిళనాడులో రజనీకాంత్ కింగ్ మేకర్గా అవతరిస్తారని సీ-ఓటర్ సర్వేలో తేలింది. దాదాపు 34శాతం ఓట్లతో 23 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతారని పేర్కొంది. అలాగే 28శాతం ఓట్లతో డీఎంకేకు 14 ఎంపీ స్థానాలు దక్కుతాయని తేల్చింది. ఇక అధికార అన్నాడీఎంకే మాత్రం దారుణంగా దెబ్బతింటుందని చెప్పింది. అన్నాడీఎంకే ఓట్ షేర్ 13శాతానికి పడిపోతుందన్న సీ-ఓటర్ కేవలం రెండంటే రెండే పార్లమెంట్ సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది.