ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్తో 28 రోజుల కాలపరిమితిపై 4జిబి 3జి డేటా ఇవ్వనున్నట్టు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది ఫుట్ బాల్ ప్రియులు;ఆకోసమని చెప్పి.. ‘ఫిఫా వరల్డ్ కప్ స్పెషల్ డేటా ఎస్టివి 149’ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. కానీ ఇందులో ఉచిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు వర్తించవని పేర్కొంది.