ఇవాళ (మంగళవారం) వెలువడిన ఫలితాలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు.. ఈ తీర్పు నరేంద్ర మోడీ పనితీరుకు మెచ్చి ఇచ్చిన తీర్పని.. కర్ణాటకలో బీజేపీ ఓటమికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నించారని. కానీ అయన కుయుక్తులు ప్రజలు సాగనీయలేదని అన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో ఎక్కువమంది తెలుగువారు నివసిస్తున్నారు.. వారిలో ఎక్కువయింది బీజేపీకి ఓటు వేశారు అని ఈ సందర్బంగా రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు.