పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు...బీజేపీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో...రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన ద్రోహాన్ని సహించలేక...పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు...నర్సాపురం ఎంపీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేయనున్నారు.