ధర్మపురి అరవింద్ సవాల్ ...నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కవితను పోటీ చేయించే ధమ్ముందా..?
టీఆర్ఎస్ పాలనలో ఏం ప్రగతి జరిగిందని.. నిజామాబాద్లో సభ పెడుతున్నారని.. బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ప్రగతి నివేదన సభలు కావని.. సోది సభలని ఎద్దేవా చేశారు. అలాంటి సోదిని వినేందుకు నిజామాబాద్ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన కవితను పోటీచేయించే ధైర్యం ఉందా అని అరవింద్ సవాల్ విసిరాడు.