చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ తో కలవడం ఎన్టీఆర్ ఆలోచనను తాకట్టుపెట్టడమేనన్నారు. తెలంగాణలో మహాకూటమి మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నది నందమూరి టీడీపీ కాదు నారావారి టీడీపీ అన్నారు.