భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో ఉక్కుమనిషి జయంతిరోజు పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఐక్యత విగ్రహంగా పిలువబడే ఈ కట్టడాన్ని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ మంగళవారం వీక్షించారు. కాగా 152 మీటర్ల ఎత్తులో పటేల్ ఫోటో గ్యాలరీకి లిఫ్ట్ ద్వారా సుశీల్ వెంట సౌరభ్ పటేల్, ఇతర ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది, మీడియా వ్యక్తులు లిఫ్ట్ ఎక్కాగా ఓవర్ లోడ్ అవ్వడంతో మీడియా మిత్రులు కిందనే ఆగిపోయారు లిఫ్ట్ పోయే క్రమంలో రెండుసార్లు మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోయి లిఫ్ట్ డోర్లు మాత్రం మూసుకుపోవడంతో ఊపిరాడక చాలా ఇబ్బందిపడ్డారు. ఈ విషయంలో సుశీల్ మోదీని చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు.