బోఫోర్స్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట

Update: 2018-11-02 08:38 GMT

భోఫోర్స్‌ కేసులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. ఈ కేసులో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిందూజా సోదరులతోపాటు ఇతర నిందితులను గతంలో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ ఉత్తర్వులను సీబీఐ సుప్రీంలో సవాల్‌ చేసింది. సీబీఐ వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ ఆలస్యంగా అప్పీల్‌ చేసిందని అందుకు చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవని ధర్మాసనం పేర్కొంది.

Similar News