పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఇవాళ భారత్ బంద్ జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ బంద్కు టీడీపీ, ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, ఎస్పీతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. భారత్ బంద్కు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఛత్తీస్ ఘడ్ లోని రాయిపూర్ లో కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపింది. ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు దెయ్యాల గెటప్ లలో జనాలను కొరుక్కు తింటున్నట్లు నటించారు. అధిక ధరలతో మోడీ ప్రభుత్వం సామాన్యుల బతుకులను నాశనం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.