అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జోధ్పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆశారాంతో పాటు మరో ఇద్దరికి 20ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఈనెల 7న జోధ్పూర్ ట్రయల్ కోర్టులో వాదనలు ముగిశాయి. 2013లో మధ్యప్రదేశ్ చింద్వారాలోని ఆశ్రమంలో.. బాలికపై అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆశారాం బాపును దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది.