వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త

Update: 2018-09-10 09:46 GMT

ఆంధ్ర ప్రదేశ్‌లో వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.  ప్రస్తుతం విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 87 రూపాయల వరకు ఉండగా..డీజిల్‌ ధర 80 రూపాయలు వరకు చేరింది. 

Similar News