ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

Update: 2018-11-09 11:15 GMT

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల11న ఉదయం 11గంటల 45 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ జరగదనుందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో ఈసారి ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చోటు కల్పించనున్నారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కిడారి సర్వేస్వరరావు కుమారుడు శ్రవణ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఫరూక్‌కు కూడా కేబినెట్‌లో చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రజావేదికలో ఈ నెల 11న మంత్రివర్గ విస్తరణ జరగనుంది.  

Similar News