బీజేపీ ఎదురుదాడికి దిగితే.. ప్రజలు క్షమించరు : చంద్రబాబు

Update: 2018-03-07 11:20 GMT

హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలను ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తాను ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా ద్వారా ఇస్తున్న రాయితీలన్నింటినీ ఏపీకి ఇవ్వాలని ఆనాడే స్పష్టంగా చెప్పానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి, ఎదురుదాడికి దిగితే ప్రజలు క్షమించబోరని అన్నారు. 

Similar News