నేను నిప్పులా బతికాను: సీఎం చంద్రబాబు

Update: 2018-03-07 11:31 GMT

ఏపీ హక్కుల సాధనలో తాను ఎక్కడా రాజీపడలేదని, లాలూచీ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, నిప్పులా బతికానని చెప్పుకొచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో సీనియర్‌ నేతల్లో తొలిస్థానంలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఏపీలో కేంద్రాన్ని ఎప్పుడూ నిధులు అడగలేదని, ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కాబట్టే సహకరించాలని కోరుతున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నానని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు.


 

Similar News