అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2018-04-06 12:16 GMT

విపక్ష పార్టీల ఫెడరల్ ఫ్రంట్ యత్నాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో ఓ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. 2019 ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న అమిత్ షా...అప్పటికి విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీని ఏమీ చేయలేవన్నారు. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాముల్లాంటివని.. ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయంటూ ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తే.. విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కే రకాలని వ్యాఖ్యానించారు.
 

Similar News