కర్ణాటకలో గ్రహాంతరవాసి.. పశువులు మృత్యువాత!

Update: 2018-06-05 05:55 GMT

గత కొద్ది రోజులుగా భూమిమీద గ్రహాంతర వాసులు తిరుగుతుననట్టు రూమర్లు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా  కర్ణాటక ప్రాంతంలో అచ్చం గ్రహాంతర వాసిని పోలిన వింతజీవి  తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో  ఓ వార్త దావానంలా  వ్యాపించింది. కర్ణాటకలోని ఓ ప్రాంతంలో  ఓ విచిత్రమైన జీవిని జనాలు బంధించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా జనసంచారం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో వింత జీవులు సంచరిస్తున్నాయి. తెల్లారి లేచిచూసే సరికి గ్రామంలోని పశువులు రాత్రికి రాత్రే తీవ్ర గాయాలపాలవుతున్నాయి. అలా గాయాలైన పశువులు రెండు మూడు రోజుల తరువాత మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు కారణం ఆ వింతజీవులేనని ప్రచారం మొదలైంది.  

Similar News