సంచలన నిర్ణయం తీసుకున్న ‘అళగిరి’

Update: 2018-08-20 09:53 GMT

కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి తన బలాన్ని నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఆయన లక్ష మంది మద్దతుదారులతో చెన్నై నగరంలో బలప్రదర్శనకు దిగనున్నారు. వచ్చే నెల 5న చెన్నైలో శాంతిప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో డీఎంకేలో ముసలం ఏర్పడింది. ముఖ్యంగా కరుణానిధి కుమారులైన అళగిరి, ఎంకే స్టాలిన్‌ల మధ్య మనస్పర్థలు తారా స్థాయికి చేరాయ్. ఇటీవల మెరీనా తీరంలోని కరుణానిధి సమాధికి అంజలి ఘటించిన తర్వాత అళగిరి తన కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇటీవల డీఎంకే కార్యవర్గ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు. మున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని విజయబావుటా ఎగురవేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. స్టాలిన్‌ వ్యాఖ్యలపై అలగిరి ఆగ్రహంతో ఉన్నారు. 

Similar News