ఎమ్మెల్యేల అనర్హతపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 18 ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడాన్ని కోర్టు సమర్ధించింది. న్యాయస్ధానం తీర్పుతో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తమ అభ్యర్దిత్వాన్ని కోల్పోయారు. తాజా తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వం పూర్తి మెజార్టీకి చేరుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని ప్రకటించారు.