బీజేపీలో చేరిన నటి వరలక్ష్మి? : మురళీధర రావు ను అందుకే కలిశా : వరలక్ష్మి

Update: 2018-06-07 04:45 GMT

తమిళ హీరోయిన్ వరలక్ష్మి బీజేపీలో చేరారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నేతృత్వంలో బీజేపీ కండువా కప్పుకున్నారని తమిళ మీడియాతోపాటు పలు వెబ్సైట్లు రాశాయి. ఈ వార్తలపై నటి వరలక్ష్మి స్పందించారు. తాను బీజేపీలో చేరిన కథనాలను ఆమె ఖండించారు.. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని అందుకోసం మురళీధర రావుని  తాను కలిసి ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్నానని. దేశ ప్రగతి,మహిళల భద్రత గురించి నరేంద్ర మోడీ  ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన కృషిని మురళీధర రావు  వివరించారని, ఈ విషయాలు తనకు చాలా సంతృప్తి కలిగించాయని ఆమె అన్నారు. 

Similar News