కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేత, నటుడు సాయికుమార్ ఓటమి చెందారు. భాగేపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సాయికుమార్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఓటు షేర్ పరంగా సాయికుమార్ మూడవ స్థానానికి పడిపోయారు. కాగా అయన ఓటమితో బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి కలత చెందారు.సాయికుమార్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించింది గాలి వర్గం. కానీ అనూహ్యంగా గెలుపు సుబ్బారెడ్డి ని వరించింది.