చత్తీస్ఘడ్లో 62 మంది నక్సల్స్ ఇవాళ పోలీసులు ముందు లొంగిపోయారు. 51 నాటు తుపాకులను కూడా వాళ్లు సరెండర్ చేశారు. బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా, నారాయణ్పూర్ ఎస్పీ జితేంద్ర శుక్లాల ముందు నక్సల్స్ లొంగిపోయారు. చత్తీస్ఘడ్లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 12, 20వ తేదీల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మావోయిస్టు భావజాలం పై హింసాకాండను దూరం చేసుకొని నక్సలైట్లు తిరిగి వెనక్కి వచ్చారని అధికారులు వెల్లడించారు. మాజీ సీనియర్ సభ్యుల అడుగుజాడలను అనుసరించి ప్రజా చైతన్య స్రవంతికి తిరిగి రావాలని సీనియర్ పోలీసు అధికారులు నక్సల్ ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయే విధానం కింద, హింసను దూరం చేస్తున్న నక్సల్స్ కు పునరావాసం కల్పించాలని అధికారులు వాదిస్తున్నారు.