మధ్యప్రదేశ్లోని దివాస్లో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడిపోయింది. వ్యవసాయ పొలం వద్ద చిన్నారి ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ఈ బోరు బావి లోతు 40 ఫీట్లు ఉంది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.