ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

Update: 2018-06-13 04:25 GMT

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  బుధవారం తెల్లవారు జామున  ఓ ప్రయివేట్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు 17 మంది మృతి చెందారు మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ మెయిన్‌పూర్‌ జాతీయ రహదారిపై జరిగింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

Similar News