మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగడంతో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు, మావోయిస్టులకూ మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు కనిపించడంతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కుంట ఎస్పీ అభిషేక్ మీనా ధృవీకరించారు. ఘటనా స్థలంలో 16 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.