ఒకే ఇంట్లో 132 నాగుపాములు....వింతను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం

Update: 2018-06-25 04:55 GMT

ఒకే ఇంట్లో 132 నాగుపాములు, పిల్లలు.. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే  సంఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. భద్రక్‌ జిల్లా ధామ్‌నగర్‌ సమితి పయికోసాహి గ్రామంలో బిజయ్‌ భుయ్యా ఇంట్లో ఈ పాములు వెలుగుచూడటంతో కలకలం రేపింది. రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఈ వింతను  చూసేందుకు స్థానికులు బారీగా తరలిస్తున్నారు.  అయితే భారీ మొత్తంలో కనిపించిన పాములను స్నేక్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు పట్టుకున్నారు. 

Similar News