Today Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Today Stock Market: సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగసి 48,551 వద్ద ట్రేడింగ్
Representational Image
Today Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి... గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజావారం మలి సెషన్ లో సానుకూల బాటన దేశీ సూచీలు ట్రేడింగ్ ఆరంభించాయి. ఉదయం పది గంటల సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగసి 48,551 వద్దకు చేరగా.. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 14,542 వద్ద కదలాడుతున్నాయి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పట్ల ఆశావహ అంచనాలకు తోడు దేశంలో కరోనా కల్లోలాన్ని తగ్గించేందుకు కేంద్రం చేపడ్తున్న చర్యల పట్ల మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.