Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట
Equity Market: సెన్సెక్స్ 143పాయింట్ల నష్టంతో 52,625వద్ద ట్రేడింగ్ * నిఫ్టీ 41పాయింట్లు నష్టపోయి 15,770 వద్ద
Representational Image
Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 52,625 వద్దకు చేరగా నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 15,770 వద్ద కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపుతో పాటు ఆసియా మార్కెట్ల అప్రమత్తత తదితర పరిణామాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.