Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం
Stock Market: సెన్సెక్స్ 442 పాయింట్లు జంప్ చేసి 50,007 వద్ద ట్రేడ్ * నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 15,037 వద్ద
Representational Image
Stock Market: దేశి స్టాక్ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వారాంతాన భారీ లాభాలతో దేశీ సూచీలు ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 442 పాయింట్లు జంప్ చేసి 50,007 వద్దకు చేరగా నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 15,037 వద్ద కదలాడుతున్నాయి. కాగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో గత రెండ్రోజులుగా నష్టాల బాటన సాగగా..వీకెండ్ సెషన్ ను లాభాలతో సూచీలు ప్రారంచించడం ఊరటనిచ్చే అంశంగా మారింది.