Stock Market: వరుసగా ఐదో రోజూ నష్టపోయిన దేశీయ మార్కెట్లు
*37 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ *8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Stock Market: వరుసగా ఐదో రోజూ నష్టపోయిన దేశీయ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంకా కోలుకోలేదు. ఇవాళ వరుసగా అయిదో రోజున కూడా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన షేర్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 57 వేల 107 వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 17 వేల 7 వద్ద క్లోజయ్యింది.