Stock Market: వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
* 167 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ * 54 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Representational Photo
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 386 పాయింట్ల వరకు పెరిగింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 58వేల 297కి చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 17వేల 378కి ఎగబాకింది.