Stock Market: లాభాల జోరులో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 358 పాయింట్లు మేర జంప్ * నిఫ్టీ 97 పాయింట్లు మేర లాభంతో 14,788 వద్ద ట్రేడింగ్

Update: 2021-04-01 04:20 GMT

స్టాక్ మార్కెట్ (ఫైల్ ఇమేజ్)

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజున బెంచ్‌మార్క్ సూచీలు లాభఆల బాటన దూకుడు కొనసాగిస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 358 పాయింట్లు మేర జంప్ చేయగా నిఫ్టీ 14,800 మార్క్ దిగువకు చేరాయి.

అయితే దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు. యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగింది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 338 పాయింట్లు ఎగసి 49,840 వద్దకు చేరగా నిఫ్టీ97 పాయింట్లు మేర లాభంతో 14,788 వద్ద కదలాడుతున్నాయి.

Tags:    

Similar News