Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: 767 పాయింట్ల లాభంతో 60,686కి చేరిన సెన్సెక్స్
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా తదితర హెవీ వెయిట్ కంపెనీల షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. దీంతో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 767 పాయింట్లు లాభపడి 60వేల 686కి చేరుకుంది. నిఫ్టీ 229 పాయింట్లు పుంజుకుని 18వేల 102కి ఎగబాకింది.