Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల ముగింపు
Stock Market: క్రితం సెషన్ లో సరికొత్త గరిష్టాలు నమోదు * వారాంతాన ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించి చివరకు నష్టాలు
Representational Image
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్ లో సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన బెంచ్ మార్క్ సూచీలు వారాంతాన ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించి చివరకు నష్టాల్లో ముగిశాయి..మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132 పాయిట్లు కోల్పోయి 52,100 వద్దకు చేరగా నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 15,670 పాయింట్ల వద్ద స్థిరపడింది. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో పాటు కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచుతూ ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించడం మార్కెట్ పై ప్రభావాన్ని చూపినట్లయింది.