బుల్ జోరు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

*గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం *బీఎస్ఈ సెన్సెక్స్ 840 పాయింట్లు మేర జంప్

Update: 2021-01-19 11:18 GMT

దలాల్ స్ట్రీట్ ఫైల్ ఫోటో

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.....గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 840 పాయింట్ల వద్దకు చేరగా.. ...నిఫ్టీ 14,500 పాయింట్ల ఎగువన స్థిరపడ్డాయి... తాజా వారం తొలి సెషన్ లో భారీ నష్టాల్లో ముగిసిన దేశీ సూచీలు మలి సెషన్ లో బౌన్స్ బ్యాక్ కాగలిగాయి..మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్‌ చేసి 49,398 వద్ద, నిఫ్టీ 239 పాయింట్లు ఎగసి 14,521 వద్ద స్థిరపడ్డాయి... ప్రపంచ ఆర్థిక రికవరీపై సానుకూల అంచనాలు .. విదేశీ మదుపర్ల నిరవధిక పెట్టుబడులు ..కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు..వెరసి సూచీలు దూకుడుగా సాగాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News