రెండోరోజూ పెరిగిన పెట్రోల్ ధర! డీజిల్ ధరలూ అదే దారిలో!!

వరుసగా రెండోరోజూ 09-11-2019 పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ లీటరుకు 16 పైసలు పెరిగింది.

Update: 2019-11-09 02:03 GMT

దాదాపు నెల రోజుల తరువాత దేశీయంగా నిన్న పెరిగిన పెట్రోల్ ధరలు రెండో రోజూ అదేదారిలో ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. 09-11-2019 శనివారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 16 పైసలు పెరిగింది. దీంతో 77.53 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా లీటరుకు 8 పైసలు పెరిగి 71.93 రూపాయలకు చేరుకుంది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 77.15 రూపాయలు గానూ, డీజిల్ ధర 8 పైసలు పెరిగి 71.23 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర పెరిగాయి. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగి 76.78 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 8 పైసలు పెరిగి 70.89 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిలు ధర లీటరుకు 7 పైసలు పెరిగాయి.  దీంతో, పెట్రోలు ధర 72.85 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.91 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిలు ధర లీటరుకు 7 పైసలు పెరిగాయి. దీంతో, పెట్రోల్ 78.52 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.13 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Tags:    

Similar News