ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు మరింత సమయం ఇచ్చిన ప్రభుత్వం.. ఎప్పటివరకూ అంటే..

Update: 2021-08-30 05:37 GMT

IT Returns Last Date 2021 - (Image source: The Economic Times)

IT Returns Last Date 2021: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ తేదీ ఆగస్టు 31. ఈ మార్పు ప్రత్యక్ష పన్ను వివాద్ సే విశ్వాస్ (VSV) చట్టంలోని సెక్షన్ 3 కింద జరిగింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఐటి పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దీనికోసం తేదీ పొడిగింపు అనివార్యం అయింది.

వివాద్ సే విశ్వాస్ చట్టం కింద అవసరమైన ఫారం III యొక్క సమస్య మరియు సవరణకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు CBDT ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్‌కు సెప్టెంబర్ 15 వరకు సమయం ఉంది.

ఇటీవల, ఆదాయపు పన్ను శాఖ యొక్క కొత్త పోర్టల్‌లో సాంకేతిక లోపాల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ MD-CEO అయిన సలీల్ పరేఖ్ మధ్య సమావేశం జరిగింది. పోర్టల్ సమస్యలపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని పరేఖ్ ముందు లేవనెత్తారు. సుమారు రెండున్నర నెలలు గడిచిన తర్వాత కూడా పోర్టల్ ఎందుకు సజావుగా పనిచేయడం లేదని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. పోర్టల్‌లోని లోపాలను సరిచేయడానికి ఆర్థిక మంత్రి సెప్టెంబర్ 15 వరకు ఇన్ఫోసిస్‌కు సమయం ఇచ్చారు.

Tags:    

Similar News