Insurance: కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల భరోసా..ఈ అద్భుతమైన పథకం గురించి తెలుసా..?

Insurance: నేటి కాలంలో ఒక టీ తాగాలన్నా కనీసం రూ. 10 ఖర్చు చేయాల్సిందే. అలాంటిది కేవలం 45 పైసలతో మీ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక రక్షణ లభిస్తుందంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే.

Update: 2026-02-14 03:08 GMT

Insurance: కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల భరోసా..ఈ అద్భుతమైన పథకం గురించి తెలుసా..?

Insurance: నేటి కాలంలో ఒక టీ తాగాలన్నా కనీసం రూ. 10 ఖర్చు చేయాల్సిందే. అలాంటిది కేవలం 45 పైసలతో మీ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక రక్షణ లభిస్తుందంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. భారతీయ రైల్వే అందిస్తున్న ఈ అత్యంత చౌకైన ప్రమాద బీమా గురించి ప్రతి ప్రయాణికుడు తప్పక తెలుసుకోవాలి. మీరు ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసే సమయంలో, Payment పేజీకి వెళ్లే ముందు Do you want to take Travel Insurance? అనే చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. చాలామంది దీనిని విస్మరిస్తారు. కానీ, అక్కడ Yes అని క్లిక్ చేస్తే, కేవలం 45 పైసల ప్రీమియంతో మీ ప్రయాణం సురక్షితం అవుతుంది.

ఏయే ప్రయోజనాలు ఉంటాయి?

ఈ బీమా రైలు ప్రమాదాలు లేదా అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వర్తిస్తుంది.

మరణం లేదా పూర్తి వైకల్యం: రూ. 10 లక్షల పరిహారం.

పాక్షిక శాశ్వత వైకల్యం: రూ. 7.5 లక్షల వరకు సాయం.

ఆసుపత్రి ఖర్చులు: గాయపడిన వారికి రూ. 2 లక్షల వరకు చికిత్స ఖర్చులు.

అదనపు సాయం: మృతదేహ రవాణా కోసం రూ. 10,000 వరకు అందిస్తారు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

టికెట్ బుక్ అయ్యాక మీ ఈమెయిల్ లేదా ఫోన్‌కు వచ్చే లింక్ ద్వారా నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయండి. ఇది క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది.కేవలం భారతీయ పౌరులకు, కన్ఫర్మ్డ్ లేదా RAC టికెట్లు ఉన్నవారికి మాత్రమే. కౌంటర్ టికెట్లకు ఇది వర్తించదు.ప్రమాదం జరిగినప్పుడు నేరుగా సంబంధిత బీమా కంపెనీని సంప్రదించి పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది.

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. రూపాయి కంటే తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి కొండంత అండగా నిలిచే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇకపై రైలు టికెట్ బుక్ చేసే ప్రతిసారీ ఆ '45 పైసల' ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం మర్చిపోకండి.

Tags:    

Similar News