Shirdi: షిరిడీ వెళ్లే భక్తులకు శుభవార్త… స్పెషల్ రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ!

Shirdi special trains: శ్రద్ధా, భక్తిగల సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. శిరిడీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2025-06-23 04:12 GMT

Shirdi: షిరిడీ వెళ్లే భక్తులకు శుభవార్త… స్పెషల్ రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ!

Shirdi special trains: శ్రద్ధా, భక్తిగల సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. శిరిడీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు జూలై 3 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది.

స్పెషల్ రైళ్ల వివరాలు:

♦ సికింద్రాబాద్ → నాగర్‌సోల్ స్పెషల్ (ట్రైన్ నెం. 07007):

♦ ప్రతి గురువారం నడుస్తుంది

♦ రాత్రి 9:20 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి

♦ తర్వాత రోజు ఉదయం 9:45కు నాగర్‌సోల్‌కు చేరుతుంది

♦ నాగర్‌సోల్ → సికింద్రాబాద్ స్పెషల్ (ట్రైన్ నెం. 07002):

♦ ప్రతి శుక్రవారం నడుస్తుంది

♦ సాయంత్రం 5:30కు నాగర్‌సోల్‌ నుంచి బయలుదేరి

♦ తర్వాత రోజు ఉదయం 7:30కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది

రైలు ఆగే స్టేషన్లు:

మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్

అందుబాటులో ఉండే కోచ్‌లు:

♦ ఫస్ట్ ఏసీ (1AC)

♦ సెకండ్ ఏసీ (2AC)

♦ థర్డ్ ఏసీ (3AC)

శిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రిజర్వేషన్ ముందుగానే చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News