భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల జోరు

* వరుసగా నాలుగో రోజూ దేశీ సూచీలు దూకుడు.. * సెన్సెక్స్‌ 50 వేల మార్క్‌ ఎగువన, నిఫ్టీ 87 పాయింట్ల లాభం.. * ఆరంభ ట్రేడింగ్ నుంచే రికార్డు స్థాయిలో లాభాల నమోదు..

Update: 2021-01-13 06:20 GMT

Representational Image

భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి దేశీ సూచీలు వరుసగా నాలుగో రోజూ దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్‌ 50 వేల మార్క్‌ దిశగా దూసుకెళ్తుండగా నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 14,647 వద్ద ట్రేడవుతోంది తాజా సెషన్ లో మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్ నుంచే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం ఖాయమన్న సంకేతాలకు తోడు రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.59శాతానికి పరిమితం కావడం కూడా సూచీల దూకుడుకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News