మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
మరో కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2017–18 కాలానికి 8.55గా ఉన్న వడ్డీ రేటును.. 8.65 శాతంకు ఇదివరకే పెంచగా.. ప్రస్తుతం ఆ వడ్డీని అందించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో 2018–19 కాలానికి 6 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. అంతేకాదు ఇకపై ఈపీఎఫ్వో సంస్థ చందాదారుల క్లెయిమ్లను 8.65 శాతం వడ్డీతో సెటిల్ చేయాలనీ నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుకు ఆమోదముద్ర వేసింది.