భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం..వెండి ధరలూ పైపైకే!

కొద్దికాలంగా పెద్దగా మార్పులు చెందని బంగారం ధరలు శుక్రవారం షాకిచ్చాయి. అటు వెండి ధరలు కూడా పెరిగాయి.

Update: 2019-11-15 02:34 GMT

బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. కాగా..వెండి ధరలు కూడా  పెరుగుదల నమోదుచేసాయి. 15.11.2019 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారం ధరలతో పోలిస్తే 300 రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరలు కూడా కేజీకి 70 రూపాయల వరకూ పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,940రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 280 రూపాయలు పెరిగి 36,620 రూపాయలకు చేరింది. వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 70 రూపాయలు పెరిగి 48,840 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,940 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,620  రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగి 38,600 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయలు పైకెగసి 37,400 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 70 రూపాయలు పెరిగింది. దీంతో 48,840రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15.11.2019 శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News