భారీగా పెరిగిన బంగారం.. అదే బాటలో వెండి ధరలు!
మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్నటి నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు (01-12-2019) పది గ్రాముల బంగారం ధర 260 రూపాయల వరకూ పెరిగింది.
నిన్న కొద్దిపాటి పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా అదేదారిలో పెరుగుదల నమోదు చేశాయి. 01.12.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరలతో పోలిస్తే 260 రూపాయలవరకూ పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా పైకెగశాయి.
ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయలు పెరిగి 39,770 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయలు పెరిగి 36,460 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 300 రూపాయలు పెరిగి 46,650 రూపాయలకు ఎగబాకింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,770 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,460 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పై చూపులు చూశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో 38,400 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయలు పెరగడంతో 37,200 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 300 రూపాయలు పెరిగి 46,650 రూపాయల వద్దకు చేరుకున్నాయి.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01.12.2019 ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.