దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల సునామీ

*మార్కెట్ వర్గాలను మెప్పించిన కేంద్ర బడ్జెట్‌.. *భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. *సెన్సెక్స్ 2300 పాయింట్లు అప్..

Update: 2021-02-01 11:45 GMT

దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి..కేంద్ర బడ్జెట్‌ ...మార్కెట్ వర్గాలను మెప్పించిన నేపధ్యంలో స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 2300 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా ..అటు నిఫ్టీ సైతం 14 వేల పాయింట్ల ఎగువకు చేరింది...మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2314 పాయింట్ల మేర ఎగసి 48,600 వద్దకు చేరగా..నిఫ్టీ 646 పాయింట్లు జంప్ చేసి 14,281 వద్ద స్థిరపడింది..సూచీల దూకుడు కారణంగా ఒక్కరోజులో 5.2 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు లాభాలను

ఆర్జించగా..మార్కెట్ విలువ 191.32 కోట్ల రూపాయలకు పెరిగింది..కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో ఆరోగ్య సంరక్షణ‌, ఆటో, ఇన్ ఫ్రా రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్ర‌క‌టించ‌డంతో మార్కెట్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డినట్లయింది.

Tags:    

Similar News