వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో ధరలు

* మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై * సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న పెట్రోల్ ధరలు * ముంబై లో 95 రూపాయలకు చేరువన పెట్రోల్ ధర

Update: 2021-02-12 04:24 GMT

Representational Image

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు ఇంధన ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి పెట్రోలియం కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26 నుంచి 29 పైసలు డీజిల్ పై 34 నుంచి 38 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 87 రూపాయల 85 పైసలు, డీజిల్ 78 రూపాయల 38 పైసలు వద్దకు చేరాయి ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 64 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 91 రూపాయల 65 పైసలు డీజిల్ 85 రూపాయల 50 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News