Andhra Pradesh: లోకేష్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు: ఎమ్మెల్యే రోజా

Andhra Pradesh: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి చంద్రబాబు లేఖ ఎందుకు రాయలేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

Update: 2021-02-20 13:55 GMT

రోజా ఫైల్ ఫోటో (ThehansIndia)

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి అన్న రోజా.. అందుకే కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తరిమి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. అటు.. లోకేష్ పైనా ఎమ్మెల్యే ఘాటు విమర్శలు చేశారు. అందరి మెడలు వంచుతానన్న లోకేష్‌కు ఎప్పుడో మంగళగిరి ప్రజలు మెడలు వంచారని వెద్దేవా చేశారు.


Tags:    

Similar News