నేడు గోదావరి జిల్లాల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేపట్టనున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఉండి, ఉంగుటూరు, నిడదవోలు, గోపాలపురంలో షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు.